పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు మారుతి డైరెక్షన్లో హారర్ కామెడీ చిత్రం ‘ది రాజాసాబ్’లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ ఓ విషయంలో చాలా తగ్గించినట్లు తెలుస్తోంది.
రాజాసాబ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమా కోసం ప్రభాస్ తన రెగ్యులర్ రెమ్యునరేషన్ రూ.150 కోట్లు కాకుండా రూ.100 కోట్లు మాత్రమే తీసుకుంటున్నాడట. ఈ సినిమా కోసం ఆయన రూ.50 కోట్లు తగ్గించినట్లు తెలుస్తోంది. దీనికి కారణం కూడా ఉందని తెలుస్తోంది.
గతంలో ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రంతో ఈ నిర్మాత నష్టాలను చవిచూశారు. అందుకే, ఇప్పుడు ఆయన కోసం ప్రభాస్ తన రెమ్యునరేషన్ తగ్గించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రభాస్ రాజాసాబ్ చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్తో పాటు అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.