రజినీ వర్సెస్ ఎన్టీఆర్.. ఎంతవరకు నిజం?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ‘కూలీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కి్స్తుండటంతో ఈ మూవీపై అంచనాలు పీక్స్‌లో నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ఆగస్టు 14న వరల్డ్ వైడ్ రిలీజ్‌కు రెడీ అయింది. అయితే, అదే రోజున బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ చిత్రం ‘వార్-2’ కూడా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో పాటు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ నటిస్తున్నాడు.

దీంతో ఆగస్టు 14న బాక్సాఫీస్ దగ్గర రజినీ వర్సెస్ ఎన్టీఆర్ క్లాష్ అనివార్యం అయ్యింది. కానీ, ఈ క్లాష్ వచ్చే ఏడాది కూడా ఉండబోతుందని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. రజినీకాంత్ తన నెక్స్ట్ మూవీగా ‘జైలర్-2’ని తెరకెక్కించనున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా షూటింగ్‌లో రజినీ వచ్చే వారం జాయిన్ కానున్నాడట. అటు ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్ ఏప్రిల్ 22 నుంచి జాయిన్ అవుతాడు.

ఇలా ఒకే సమయంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ రెండు సినిమాలు 2026 ఏప్రిల్‌లో రిలీజ్ ప్లాన్ చేస్తు్న్నాయట. ఒక వారం రోజుల గ్యాప్‌లో ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర క్లాష్ అవుతాయని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. అంటే.. 2025లోనే కాకుండా 2026లోనూ బాక్సాఫీస్ దగ్గర రజినీ వర్సెస్ ఎన్టీఆర్ వార్ జరగనుందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version