హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘తమ్ముడు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని ‘వకీల్ సాబ్’ ఫేం వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్కు మంచి రెస్పాన్స్ లభించింది.
అయితే, ఈ చిత్ర స్టోరీలైన్కు సంబంధించిన విషయాలను ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ఈ సినిమాలో నటి లయ నితిన్ సోదరిగా నటిస్తుందని.. ఈ చిత్ర కథ మొత్తం ఒక్క రాత్రిలోనే జరుగుతుందని.. ఎమోషన్, యాక్షన్తో ఈ కథ గ్రిప్పింగ్గా ఉండబోతుందని ఆయన అన్నారు.
ఈ చిత్ర ఎమోషనల్ డెప్త్, స్క్రీన్ ప్లే వర్క్ ఈ సినిమాకు హైలైట్గా ఉండబోతున్నాయి. ఈ సినిమాలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, శ్వాసిక, సౌరభ్ సచ్దేవా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తుండగా జూలై 4న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్కు రెడీ చేస్తున్నారు.