టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాధ్ తన నెక్స్ట్ చిత్రాన్ని తమిళ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతితో తెరకెక్కించబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. ఇక ఈ సినిమా షూటింగ్ను అతి త్వరలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు సంగీతం అందించే బాధ్యతను ప్రముఖ సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తనదైన మ్యూజిక్తో మంచి హిట్ చిత్రాలకు మ్యూజిక్ కంపోజ్ చేశాడు మహతి స్వర సాగర్.
మరి నిజంగానే పూరీ – విజయ్ చిత్రానికి ఆయన సంగీతం అందిస్తాడా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో టబు, దునియా విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమాను పూరీతో కలిసి ఛార్మి ప్రొడ్యూస్ చేయనుంది.