రాజమౌళి తర్వాత మహేష్ ఆ డైరెక్టర్‌తో సినిమా చేస్తాడా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో SSMB29 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటోంది.

ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ కావడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ సినిమా తర్వాత మహేష్ తన నెక్స్ట్ చిత్రాన్ని ‘పెద్ది’ మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో చేయబోతున్నట్లు ఓ వార్త వినిపిస్తోంది. గతంలో బుచ్చిబాబుని కలిసిన మహేష్, ఏదైనా కథ ఉంటే చేద్దామని ఆయనకు మాట ఇచ్చాడట.

దీంతో బుచ్చిబాబు ‘పెద్ది’ తర్వాత మహేష్‌ను లైన్ పెట్టడం ఖాయమని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఇక మహేష్ కూడా రాజమౌళి తర్వాత తన నెక్స్ట్ మూవీని ఎవరితో చేస్తాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version