టాలీవుడ్ లో తెరకెక్కుతున్న చిత్రాల్లో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ‘కుబేర’ కూడా ఒకటి. ఈ సినిమాలో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తవగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఈ చిత్రం బిజీగా ఉంది.
అయితే, ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్ర ఓటీటీ రైట్స్ ఏకంగా రూ.50 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ రేంజ్లో డీల్ కుదరడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.