కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు నిర్మాతగా తన తనయుడు మంచు విష్ణు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘దేనికైనా రెడీ’. ఈ సినిమా విడుదలైన రోజు నుంచి సినిమాలో బ్రాహ్మణులను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని వాటిని తొలగించాలని బ్రాహ్మణులు నిరసనలు తెలుపుతున్నారు. అదీ కాస్త ముదిరి బ్రాహ్మణులు అంతా కలిసి ఈ రోజు మోహన్ బాబు ఇంటి ముందు ధర్నా చేసారు. అలాగే సినిమాలో ఆ సన్నివేశాలను తొలగించాలని వారు డిమాండ్ చేసారు. రేపటి నుంచి ఆ సన్నివేశాలు ఉంటే కోర్టుకి వెళ్తామని వారు నినాదాలు చేసారు. ధర్నా కాస్తా పెద్దది కావడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసారు. ఇప్పటికే కొన్ని బ్రాహ్మణ సంఘాలు ఆ సన్నివేశాలను తొలగించాలని ఫిల్మ్ చాంబర్ కి వినతిపత్రం కూడా సమర్పించారు. స్వతహాగా ఎదుటి వారికి గౌరవం ఇచ్చే డా. మోహన్ బాబు గారు స్పందించి బ్రాహ్మణుల మనోభావాలకు విలువ నిచ్చి ఆ సన్నివేశాలను తొలగిస్తారా లేదా అనే నిర్ణయం కోసం మరికొంత సమయం వేచి చూడాల్సిందే.
మోహన్ బాబు ఇంటి ముందు ధర్నా?
మోహన్ బాబు ఇంటి ముందు ధర్నా?
Published on Oct 29, 2012 7:26 PM IST
సంబంధిత సమాచారం
- ‘మదరాసి’కి ప్లాన్ చేసుకున్న మరో క్లైమాక్స్ చెప్పిన మురుగదాస్.. ఇలా చేసుంటే?
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- అవైటెడ్ ‘ఓజి’ ట్రైలర్ ఆరోజున?
- అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్ ?
- అల్లు అర్జున్ కూడా అప్పుడే వస్తాడా..?
- పుష్ప విలన్తో 96 డైరెక్టర్.. ఇదో వెరైటీ..!
- ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ డేట్!
- ‘ఓజి’ దూకుడు ఆగేలా లేదుగా..!
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన లేటెస్ట్ కన్నడ హిట్!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ