టాలీవుడ్ టాలెంటెడ్ యువ హీరోలు మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ అలాగే నారా రోహిత్ ల కలయికలో నాంది సినిమా ఫేమ్ దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే “భైరవం”. అయితే ఈ సినిమాని బాయ్ కాట్ చేయాలంటూ మెగా అభిమానులు ఊహించని విధంగా ట్రెండ్ చేయడం ఇపుడు అందరికీ షాకిచ్చింది.
అయితే దీనికి కారణం గతంలో ఈ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవి సహా రామ్ చరణ్ లపై మార్ఫ్ ట్రోల్స్ ని షేర్ చేయడమే అని మెగా అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై దర్శకుడు స్పందించడం జరిగింది. ఇన్నిరోజులు తనకి అండగా ఉన్న మెగా అభిమానులు ఇపుడు ఒక్కసారిగా తనకి వ్యతిరేకం కావడం షాకింగ్ గా అనిపించింది. అని తాను ఆ పోస్ట్ చేయలేదని బహుశా ఎవరో హాక్ చేసి ఉండొచ్చు.
నేను మెగా హీరోలు అందరి సినిమాలకి వర్క్ చేసానని పవన్ కళ్యాణ్ గారు సాయి ధరమ్ తేజ్ లతో పని చేసినపుడు వారు ఎంతో ఇంకారెహ్ చేసారని నేను కూడా మీలో ఒకడినే అంటూ ఓ పోస్ట్ చేసి మెగా అభిమానులకి క్షమాపణ చెబుతున్నాను అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో ఈ పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది.
నమస్కారం
అందరికీ గుడ్ ఈవెనింగ్ అండీ..
మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులకు అందరికీ గుడ్ ఈవెనింగ్. మేము మే 18న భైరవం ట్రైలర్ రిలీజ్ చేసాం. అప్పటి నుంచి నా మీద సోషల్ మీడియాలో కొంచెం ట్రోలింగ్…
— Vijay Kanakamedala (@DirVijayK) May 22, 2025