నన్ను చూసుకునే నాకు పొగరు – బాలయ్య

నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్‌ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు హిందూపురంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘నా రెండో పుట్టినిల్లు హిందూపురం. ఇది నందమూరిపురం. ఇక్కడ పౌరసన్మాన సభ నిర్వహించడం ఆనందంగా ఉంది. దీనికి కారకులైన అందరికీ కృతజ్ఞతలు. పద్మభూషణ్‌ మీకు చాలా ఆలస్యంగా ఇచ్చారని చాలామంది అన్నారు. కాదు సరైన సమయంలోనే ఇచ్చారని చెప్పా’ అని బాలయ్య అన్నారు.

బాలయ్య ఇంకా మాట్లాడుతూ.. ‘నాన్నగారి శతజయంతి నిర్వహించుకోవడం, మూడోసారి నేను ఎమ్మెల్యేగా గెలవడం, సినిమాల పరంగా నాలుగు వరుస విజయాలు అందుకోవడం, హీరోగా 50 ఏళ్లు పూర్తికావడం.. ఈ తరుణంలో పద్మభూషణ్‌ రావడం సంతోషం. 50 ఏళ్లు కథానాయకుడిగా కొనసాగిన వ్యక్తి ప్రపంచంలో మరొకరు లేరు. నాకు అంతగా శక్తినిచ్చిన తెలుగుజాతికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ‘ఏం చూసుకుని.. బాలకృష్ణకు అంత పొగరు’ అని అంటుంటారు. నన్ను చూసుకునే నాకు పొగరు’ అని బాలయ్య చెప్పుకొచ్చారు.

Exit mobile version