ఆ కొందరి రిటర్న్ గిఫ్ట్ పై ఏపీ డిప్యూటీ సీఎం ఫైర్!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఊహించని హాట్ టాపిక్ గా మారిన అంశం ఏదన్నా ఉంది అంటే కొందరు నిర్మాతలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ కి ముందు సరిగ్గా థియేటర్స్ బంద్ చేయాలని డిసైడ్ అయినట్టుగా పవన్ కి రిటర్న్ గిఫ్ట్ ఈ రకంగా ప్లాన్ చేశారు అన్నట్టుగా ఊహించని టాక్ స్ప్రెడ్ అయ్యిన సంగతి తెలిసిందే.

అయితే ఈ అంశంపై అనేక వెర్షన్ లు ఒకొకటిగా బయటకి వస్తున్నా నేపథ్యంలో టాలీవుడ్ కి చెందిన ఆ కొందరు నుంచి వచ్చిన రిటర్న్ గిఫ్ట్ పై ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యినట్టు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటనే బయటకి వచ్చింది. టాలీవుడ్ బాగు కోసం ఏపీ నుంచి ఎన్డీయే ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా సానుకూలత చూపిస్తే వారు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ బాగుంది అని డిప్యూటీ సీఎం ఫైర్ అయ్యారు.

అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యినా కూడా టాలీవుడ్ నుంచి ఎవరూ సీఎం చంద్రబాబు నాయుడుని గౌరవప్రదంగా కలిసింది లేదని మంచి గౌరవాన్నే చూపించారు అన్నట్టుగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలానే ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు. సినిమా సంఘాల ప్రతినిధులే రావాలి అని కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు.

సినిమా రంగం అభివృద్ధినే చూస్తుంది అని క్లియర్ చేసేసారు. అంతే కాకుండా తమకి నచ్చినప్పుడు అర్జీలు పెట్టుకొని టికెట్ ధరలు హైక్స్ తీసుకున్నపుడు అందుకు తగ్గట్టుగా పన్నులు కట్టారా లేదా, ఇంకా ఏపీలో థియేటర్స్ పరిస్థితులు వాటిలో స్నాక్స్ ఇతర అంశాలపై దృష్టి సారించి క్లియర్ రిపోర్ట్స్ కావాలి అన్నట్టుగా డిప్యూటీ సీఎంవో నుంచి ఆదేశాలు వచ్చాయట. మరి ఈ తతంగం అంతా ఇప్పుడప్పుడే తెగేలా లేదు అన్నట్టుగా నెటిజన్స్ ఇపుడు మాట్లాడుకుంటున్నారు. మరి ఈ హాట్ టాపిక్ అంశం ఎక్కడ వరకు వెళుతుందో చూడాలి మరి.

Exit mobile version