పూరి-సేతుపతి చిత్రం నుంచి రానున్న సాలిడ్ అప్డేట్. ఎప్పుడంటే..?

పూరి-సేతుపతి చిత్రం నుంచి రానున్న సాలిడ్ అప్డేట్. ఎప్పుడంటే..?

Published on Jun 16, 2025 11:00 PM IST

దర్శకుడు పూరి జగన్నాధ్, తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కాంబోలో తెరకెక్కబోతున్న కొత్త చిత్రం టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్ చిత్రంగా మారింది. ఈ సినిమాను అనౌన్స్ చేసిన దగ్గరనుండీ ఈ మూవీపై హ్యూజ్ బజ్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

ఇప్పటికే ఈ సినిమాలో నటిస్తున్న యాక్టర్స్‌ను ఒక్కొక్కరిగా అనౌన్స్ చేస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ ఈ సినిమాలో నటిస్తుందని.. ఆమె ఎవరనేది జూన్ 17న రివీల్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ఈ సినిమాలో ఎవరు యాడ్ అవుతున్నారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ సినిమాలో ఇప్పటికే టబూ, దునియా విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాను పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేస్తుండగా ఛార్మీ తో కలిసి పూరి కనెక్స్ట్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు