వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ని మెచ్చుకున్న అల్లు అర్జున్

allu-arjun
సందీప్ కిషన్, రాకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ బాక్స్ ఆఫీసు వద్ద విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. హీరో సందీప్ కిషన్, డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఈ సినిమా విషయంలో పలువురు ఇండస్ట్రీ పెద్దల నుండి ప్రశంశలు అందుకున్నారు. ఈ రోజు జరిగిన సక్సెస్ మీట్ లో సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘ నేను సినిమాల్లో నటించడం మొదలు పెట్టి 4 సంవత్సరాలైంది. అప్పటి నుంచి నాకు సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి థాంక్స్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ కి ప్రేక్షకుల నుండి ఇంత మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన మీడియా వారికి నా ప్రత్యెక కృతఙ్ఞతలని’ అన్నాడు.

అలాగే సందీప్ కిషన్ కి ఓ షాకింగ్ కాల్ వచ్చింది. అది చేసింది మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆ తర్వాత సందీప్ కిషన్ అల్లు అర్జున్ ఎం చెప్పాడా అనేది ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. ‘ అల్లు అర్జున్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ నచ్చిందని చెప్పారు. చాలా రోజుల తర్వాత ఈ సినిమా చూసి అంతలా నవ్వుకున్నానని చెప్పారు. నేను ఆర్య సినిమా చూసి ఆయన్ని స్పూర్తిగా తీసుకొని హీరోనయ్యాను. అలాంటిది ఇప్పుడు ఆయనే ఇలా మెచ్చుకోవడం, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ గురించి మంచిగా చెప్పడం చాలా ఆనందంగా ఉంది. థాంక్స్ అన్న’ అని ట్వీట్ చేసాడు.

ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై కిరణ్ నిర్మించిన ఈ సినిమాకి చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేయగా రమణ గోగుల మ్యూజిక్ అందించాడు.

Exit mobile version