బాలీవుడ్ సీనియర్ హీరో రిషి కపూర్ కన్నుమూయడంతో.. బాలీవుడ్ ఒక్కసారే శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన అంత్యక్రియలు ఆయన కుటుంబ సభ్యులు, కొంతమంది ప్రముఖుల సమక్షంలో ముంబైలోని చందన్వాడి స్మశానంలో ముగిశాయి. కాగా రిషి కపుర్ అంత్యక్రియలకు అలియా భట్ హాజరయ్యి ఆయనకు అంతిమ వీడ్కోలు పలికింది.
ఈ సందర్భంగా అలియా, రిషి కపూర్ భౌతిక గాయాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకోవడం అందర్ని కదిలించింది. కన్నీళ్లను ఆపుకోలేక ఆమె చాల సేపూ ఏడుస్తూనే ఉండటం చూసి పక్కన ఉన్నవారు సైతం అలియాను ఓదార్చే ప్రయత్నం చేశారు. రణ్బీర్ కపూర్ – అలియా భట్ ఇద్దరూ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.
లాక్డౌన్ నేపథ్యంలో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రిషికపూర్ కుమార్తె రిద్ధిమా కపూర్ ఢిల్లీ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారు. అంత్యక్రియలు త్వరగా ముగించాలన్న పోలీసుల నిబంధన విధించడంతో ఆమె తండ్రిని కడసారి చూడలేక పోయింది.
ఇక కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్, అనిల్ అంబానీ, అయాన్ ముఖర్జీ, అభిషేక్ బచ్చన్ తదితరులు రిషి కపూర్ కి అంతిమ వీడ్కోలు పలికారు.
Tragic times! #AliaBhatt breaks down at #RishiKapoor’s funeral. #RipRishiKapoor pic.twitter.com/7fMrlOppcS
— Filmfare (@filmfare) April 30, 2020