ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ నుండి వచ్చే భారీ చిత్రం అదే..!

ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ నుండి వచ్చే భారీ చిత్రం అదే..!

Published on May 5, 2020 6:00 PM IST

టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలలో ఒకటిగా ఉన్న మైత్రి మూవీ మేకర్స్ కొన్నాళ్లుగా ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మూవీ చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంది. నిజానికి దీనిపై వీరిమధ్య ఒప్పందాలు కూడా జరిగాయని సమాచారం. ఇక ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ చేసే మూవీ కూడా ప్రశాంత్ నీల్ తోనే అని అందరూ భావించారు. ఐతే అనూహ్యంగా త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ కమిట్ అయ్యాడు. ఐతే దీని వెనుక అసలు కారణంగా ప్రశాంత్ నీల్ సిద్ధంగా లేకపోవడమే అని సమాచారం.

ప్రస్తుతం కెజిఫ్ 2 షూటింగ్ లో ఉన్న ప్రశాంత్ నీల్, ఆ చిత్రం నుండి బయటికి రావడానికి అక్టోబర్ అవుతుంది. ఆయన కొత్త మూవీ మొదలుపెట్టడానికి మరో ఆరునెలల సమయమైనా తీసుకుంటారు. కాగా దర్శకుడు త్రివిక్రమ్ గతంలోనే ఎన్టీఆర్ కోసం సిద్ధం చేసి ఉంచిన బౌండెడ్ స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉన్నారు. అలాగే మే లో ఈ చిత్ర షూటింగ్ స్టార్ట్ చేస్తాను అని ఎన్టీఆర్ కి హామీ ఇచ్చాడు. అందుకే ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా ఒకే చేశారు.

ఐతే ఈ రెండు చిత్రాల తరువాత ఎన్టీఆర్ చేసే మూవీ ప్రశాంత్ నీల్ తోనే నట. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీగా నిర్మించనున్నారట. ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ నటించే భారీ చిత్రం ఇదే అని టాలీవుడ్లో గట్టిగా వినబడుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు