మారిన ట్రెండ్: కొత్త సినిమాలు ఓటీటీల్లో.. పాత సినిమాలు థియేటర్స్ లో చూస్తున్న జనం

మారిన ట్రెండ్: కొత్త సినిమాలు ఓటీటీల్లో.. పాత సినిమాలు థియేటర్స్ లో చూస్తున్న జనం

Published on Jun 1, 2025 6:00 PM IST

సినీ రంగంలో కూడా ఎప్పుడుకప్పుడు కొత్త ట్రెండ్ లు స్టార్ట్ అవుతూనే ఉంటాయి. అది సినిమా స్కోప్ నుంచి సినిమాని తెరకెక్కించే శైలి వరకు ప్రతీ చిన్న అంశంలో కూడా మారుతున్న కాలంతో పాటుగా కొత్త కొత్త మార్పులు చేర్పులు ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్నాయి. ఇలా ఎన్నో ఏళ్ల థియేట్రికల్ ట్రెండ్ లో కొత్త సినిమాల కోసం జనాలు థియేటర్స్ వద్ద బారులు తీరేవారు.

అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే కొత్త సినిమాలు థియేటర్స్ లో వస్తుంటే వాటిని థియేటర్స్ లో మానేసి ఓటీటీలో చూస్తాం అనే కొత్త ట్రెండ్ మొదలైంది. ఓటిటిల ఎంకరేజ్మెంట్ ఆ మధ్య కోవిడ్ లో విస్తృతంగా పెరిగిపోవడంతో ఇపుడు వాటికి అడ్డు కట్ట వేయడం అనేది కత్తి మీద సాములా మారిపోయింది.

ఇలా మారిన ట్రెండ్ లో కొత్త సినిమాలకి మొహం చాటేస్తున్న జనం పాత సినిమాలు మళ్ళీ రీమాస్టర్ చేసి థియేటర్స్ లో విడుదల చేస్తుంటే అదేదో ఇప్పుడు వస్తున్న సినిమాలకు మళ్లే డే 1 వసూళ్లు నమోదు అవుతున్నాయి. అందుకు చక్కటి ఉదాహరణే లేటెస్ట్ రీరిలీజ్ ‘ఖలేజా’ చిత్రం. ఈ సినిమా ఇది వరకే టీవీల్లో, యూట్యూబ్ లో ఇలా ఎన్నోసార్లు చూసేసి ఉంటారు.

అయినప్పటికీ ఇపుడు థియేటర్స్ లో సెన్సేషనల్ రెస్పాన్స్ ని అందుకుంటుంది. దీనితో ఇప్పుడు ట్రెండ్ చూసుకుంటే కొత్త సినిమాల కోసం ఓటిటిలలో ఎదురు చూస్తుంటే పాత సినిమాల రీరిలీజ్ థియేట్రికల్ రిలీజ్ కోసం ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. ఇలా గమ్మత్తుగా ట్రెండ్ మారిపోయింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు