కరోనా వైరస్ వ్యాప్తి ప్రాణాంతకంగా మారుతున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయినా ఈ కరోనా వ్యాప్తి అదుపులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తుంది. కాగా ఈ కరోనా వైరస్ గురించి తప్పుడు సమాచారం అందించినందుకు స్టార్ హీరో మోహన్ లాల్ పై కేసు నమోదైనట్లు తెలుస్తుంది. మోహన్ లాల్ ఓ సందర్భంగా మాట్లాడుతూ.. అందరూ కలిసి చప్పట్లు కొట్టడం వలన కరోనా వైరస్ చనిపోయే అవకాశం ఉంది. చప్పట్ల శబ్దం నుంచి ఓ మంత్రం లాంటిది పుట్టుకొస్తుంది. దీని వలన బ్యాక్టీరియా, వైరస్లు చనిపోయే అవకాశం ఉంటుంది. చప్పట్లు కొట్టి అందరం వైరస్ను కంట్రోల్ చేద్దాం, అని అన్నారు.
ఈ నేపథ్యంలో శ్రీను అనే వ్యక్తి కేరళ మానవ హక్కుల కమిషన్లో మోహన్లాల్పై ఫిర్యాదు చేసినట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మోహన్ లాల్ ఇలా ప్రచారం చేయడం సరికాదని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆ వ్యక్తి తెలిపారు.