బుక్ మై షోలో ‘కుబేర’ ర్యాంపేజ్ !

ధనుష్ – నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కుబేర’. కాగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ టాక్‌తో దూసుకెళ్తోంది. రోజురోజుకు ఈ చిత్రం అనూహ్యంగా బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటుతుండటంతో ఈ మూవీ వసూళ్ల పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతోంది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తనదైన రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ ఫామ్ బుక్ మై షోలో కుబేరకి సంబంధించి ఏకంగా 1 మిలియన్ ప్లస్ టికెట్లు అమ్ముడైనట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది.

పైగా ఇంకా సాలిడ్ గా టికెట్స్ బుక్ అవుతున్నాయి. దీంతో, బాక్సాఫీస్ దగ్గర కుబేర ర్యాంపేజ్ మామూలుగా లేదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం మెసేజ్ చేస్తూ.. ‘కుబేర సినిమాతో థియేటర్లు ఉత్సాహంగా ఉన్నాయి, ప్రేక్షకుల హృదయాలు గర్జిస్తున్నాయి, స్క్రీన్లు వెలిగిపోతున్నాయి. ఇది అద్భుతమైన మెగా బ్లాక్‌ బస్టర్’ అంటూ చిత్రబృందం మెసేజ్ ను పోస్ట్ చేసింది.

Exit mobile version