ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !

ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !

Published on Oct 27, 2025 2:00 PM IST

భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ నుంచి రానున్న 75వ చిత్రం ‘మాస్‌ జాతర’, మనదే ఇదంతా.. అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో రవితేజ ఇప్పటికే పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ప్రమోట్ చేయడానికి శ్రీలీల వంతు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లను ఆమె దూకుడుగా ప్రారంభించింది. శ్రీలీల ఇప్పటికే మీడియా సంస్థలకు పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది. నవంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోలీవుడ్‌ స్టార్ హీరో సూర్య హాజరుకానున్నట్లు చిత్రబృందం తెలిపింది. అన్నట్టు ‘మాస్‌ జాతర’కు యూ/ఏ సర్టిఫికెట్‌ లభించింది.ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఫ్యాన్స్ కూడా ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. సినిమా మంచి బజ్ ఉంది.

తాజా వార్తలు