ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్

ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్

Published on Sep 15, 2025 7:00 AM IST

Rajini,-Spb,-Ilayaraja

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీత ప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌ ఇళయరాజా, ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మధ్య స్నేహబంధాన్ని గుర్తుచేసుకున్నారు. బాలసుబ్రహ్మణ్యం మరణం ఆయన్ను ఎంతగానో కలచివేసిందని.. తన సోదరుడు, భార్య, కుమార్తె చనిపోయినా కంటతడి పెట్టుకోకుండా ధైర్యంగా ఉన్న ఇళయరాజా.. బాలుగారి మరణాన్ని మాత్రం తట్టుకోలేకపోయారని, భావోద్వేగంతో ఏడ్చేశారని రజనీకాంత్ తెలిపారు.

రజనీకాంత్ ఇంకా మాట్లాడుతూ.. ‘అలాగే, ఇళయరాజాతో తనకున్న అనుబంధాన్నీ రజనీకాంత్‌ గుర్తుచేసుకున్నారు. తాను హీరోగా నటించిన ‘జానీ’ సమయంలో తమ మధ్య జరిగిన సరదా సంభాషణలను నెమరువేసుకున్నారు. ఇదే వేడుకలో తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ మాట్లాడుతూ.. ఇళయరాజాకు ఇసైజ్ఞాని అనే బిరుదును కరుణానిధి 1988లో యాదృచ్ఛికంగా అందించారని చెప్పుకొచ్చారు. ఇక తానెప్పుడూ ఇళయరాజాకు పీఆర్‌వోనే అంటూ కమల్‌హాసన్‌ చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు