గత వారం తెలుగు ఆడియెన్స్ సహా పాన్ ఇండియా ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు శేఖర్ కమ్ముల, ధనుష్, నాగార్జున కలయికలో తెరకెక్కించిన చిత్రం “కుబేర” కూడా ఒకటి. సాలిడ్ హిట్ అయ్యిన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా మొదటి వారం రన్ ని కంప్లీట్ చేసుకొని రెండో వీకెండ్ లోకి వచ్చింది. అయితే ఈసారి కూడా కుబేర సాలిడ్ వసూళ్లు నమోదు చేస్తుండడం విశేషం.
ముఖ్యంగా ఈ శనివారం మొదటి ఆట నుంచే మంచి బుకింగ్స్ ని ఈ చిత్రం నమోదు చేస్తుండడం గమనార్హం. దీనితో కుబేర రెండో వారాంతంలో కూడా అదే ఫైర్ ని కొనసాగిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ రాక్ సాలిడ్ సంగీతం అందించగా రష్మిక మందన్నా, జిమ్ షర్బ్ లు కీలక పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.