ఓటీటీ ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేస్తున్న ‘డియర్ ఉమ’

ఓటీటీ ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేస్తున్న ‘డియర్ ఉమ’

Published on Jun 14, 2025 11:08 PM IST

సుమయా రెడ్డి నిర్మాతగా, హీరోయిన్‌గా, రచయితగా చేసిన చిత్రం ‘డియర్ ఉమ’. సమాజాన్ని మేల్కోపే ఓ కథతో సుమయా రెడ్డి చేసిన ఈ మొదటి ప్రయత్నం థియేటర్లో అందరినీ ఆకట్టుకుంది. మంచి సందేశాత్మక చిత్రంగా ‘డియర్ ఉమ’ నిలిచింది. నటిగా, నిర్మాతగా, కథా రచయితగా సుమయా రెడ్డికి మంచి పేరు వచ్చింది. థియేటర్లలో మంచి ఆదరణను దక్కించుకున్న ఈ చిత్రం ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతోంది.

సుమయా రెడ్డి తన సొంత బ్యానర్ సుమ చిత్ర ఆర్ట్స్‌పై రచయిత, నిర్మాతగా ‘డియర్ ఉమ’ చిత్రాన్ని నిర్మించింది. ఆమె సరసన పృథ్వీ అంబర్ నటించారు. సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీకి సుయమా రెడ్డి స్క్రీన్ ప్లే, సంభాషణలు కూడా రాశారు.

కార్పొరేట్ రంగం, వైద్య రంగంలోని లోపాల్ని ఎత్తి చూపుతూ తీసిన ఈ ‘డియర్ ఉమ’ ప్రస్తుతం అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. సుమయా రెడ్డి నటన, ప్రజెన్స్, పృథ్వీ అంబర్ పోషించిన పాత్ర ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌ను మెప్పించాయి. నగేష్ లైన్ ప్రొడ్యూసర్‌గా, నితిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా, రాజ్ తోట సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు. రధన్ ఈ చిత్రానికి మంచి సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం ఈ చిత్రం సన్ నెక్ట్స్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు