అక్కినేని వారింట పెళ్లి సందడితో పండుగ వాతావరణం నెలకొంది. అఖిల్ వివాహం జయినాబ్ రవడ్జీతో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుక కోసం అక్కినేని కుటుంబ సభ్యులు ఎంతో ఉత్సాహంగా వేచి చూశారు. అఖిల్ వివాహ వేడుక శుక్రవారం తెల్లవారుజామున 3.35 నిమిషాలకు జరిగినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ఇక ఈ వివాహ వేడుకకు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా అఖిల్-జయినాబ్ వివాహంపై అక్కినేని నాగార్జున ఓ పోస్ట్ చేశారు. తాను, తన భార్య అమల ఈ క్షణం కోసం ఎంతో ఎదురుచూశామని.. మంచి మనసులు నెలవైన తమ స్వగృహంలో అఖిల్-జయినాబ్ మూడుముళ్ల బంధంతో ఒక్కటి కావడం తమకు అమితమైన సంతోషాన్ని కలిగించిందని.. ఈ కొత్త జంటను అందరూ ఆశీర్వదించండి అని ఆయన కోరారు.