శ్రీను వైట్ల నెక్స్ట్ మూవీ.. ఆ బడా బ్యానర్‌లో కన్ఫర్మ్..?

శ్రీను వైట్ల నెక్స్ట్ మూవీ.. ఆ బడా బ్యానర్‌లో కన్ఫర్మ్..?

Published on Jun 6, 2025 1:01 AM IST

టాలీవుడ్‌లో కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల లాస్ట్ మూవీ ‘విశ్వం’పై మంచి అంచనాలు పెట్టుకున్నారు. అయితే, ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. దీంతో ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా, ఇప్పుడు శ్రీను వైట్ల నెక్స్ట్ చిత్రానికి మేకర్స్ కన్ఫర్మ్ అయినట్లు సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. తనకు ఎంతో పట్టున్న కామెడీ ఎంటర్‌టైనర్ కథతో తన నెక్స్ట్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు శ్రీను వైట్ల రెడీ అవుతున్నాడట.

ఇక ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయనుందట. దీంతో ఈ సినిమాలో ఎవరు నటిస్తారా.. ఈ సినిమాతో శ్రీను వైట్ల ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు