IPL 2025 : 18 ఏళ్ల కల సాకారం అయిన వేళ..పంజాబ్‌పై RCB గ్రాండ్ విక్టరీ!

IPL 2025 : 18 ఏళ్ల కల సాకారం అయిన వేళ..పంజాబ్‌పై RCB గ్రాండ్ విక్టరీ!

Published on Jun 3, 2025 11:30 PM IST

ఐపీఎల్ 2025 గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌తో RCB తన 18 ఏళ్ల కల నెరవేర్చుకుంది. ‘‘ఈ సాలా కప్ నమ్దే’’ ట్యాగ్‌లైన్‌ను నిజం చేస్తూ బెంగళూరు జట్టు తన తొలి ఐపీఎల్ కప్‌ను గెలుచుకుంది. 2025 ఐపీఎల్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో తొలి బర్త్ కన్ఫర్మ్ చేసుకున్న బెంగళూరు ముందు నుంచి దూకుడుగా ఆడి ప్రత్యర్థి జట్టుకు ఏ ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు.

పంజాబ్ కింగ్స్ తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు వచ్చిన RCB నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లీ 43 పరుగులు చేసి ఔట్ కావడం తో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. అయితే జట్టు మంచి స్కోర్ చేయడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు.

ఇక 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి వచ్చిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు నిలకడగా రాణించలేకపోయారు. శశాంక్ సింగ్ 61 పరుగులతో చివరి వరకూ పోరాడినా ఫలితం దక్కలేదు. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేసింది పంజాబ్. దీంతో ఎన్నో ఏళ్ల కలను నిజం చేస్తూ RCB ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించి అభిమానులకు సరికొత్త అనుభూతిని మిగిల్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు