పవర్ స్టార్ పనవ్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఓజి కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమాతో పవన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని మేకర్స్ భావిస్తున్నారు.
అయితే, తాజాగా ఈ చిత్ర షూటింగ్లో పవన్ జాయిన్ అయిన సంగతి తెలిసిందే. కాగా నేడు హైదరాబాద్లో జరుగుతున్న ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్లో పవన్ పాల్గొంటున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి రెట్టింపు అయ్యింది.
పవన్ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కావడంతోనే యాక్షన్ మూడ్లోకి మారిపోయాడని వారు కామెంట్ చేస్తున్నారు. అందాల భామ ప్రియాంక మోహన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా ఇమ్రాన్ హష్మి, శ్రియా రెడ్డి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.