పబ్లిక్ టాక్.. సాయి పల్లవిని డామినేట్ చేశాడుగా!

పబ్లిక్ టాక్.. సాయి పల్లవిని డామినేట్ చేశాడుగా!

Published on Feb 12, 2025 2:00 AM IST

అందాల భామ సాయి పల్లవికి టాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సాయి పల్లవి ఓ సినిమాలో నటిస్తుందని తెలిస్తే, ప్రేక్షకులు కేవలం ఆమెను చూసేందుకే ఆ సినిమాకు వెళ్లిన రోజులు ఉన్నాయి. అంతలా తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇక రీసెంట్‌గా ‘తండేల్’ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ స్టార్ బ్యూటీ. ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించగా చందూ మొండేటి డైరెక్ట్ చేశాడు.

ఈ సినిమా రిలీజ్‌కు ముందు, ఈ చిత్రంలోనూ సాయి పల్లవి తన నటనతో సినిమాను ముందుకు తీసుకెళ్తుందని అందరూ అనుకున్నారు. నిజానికి ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అయితే, ఔట్ ఆఫ్ ది బాక్స్‌గా ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరినీ తనవైపు తిప్పుకున్నాడు హీరో నాగచైతన్య. ఈ సినిమాలో చైతూ చేసిన పర్ఫార్మెన్స్ ఆయన కెరీర్‌లోనే బెస్ట్ అని అందరూ అంటున్నారు.

తండేల్ చిత్రాన్ని అత్యంత ప్రెస్టీజియస్‌గా తీసుకున్న చైతూ, ఈ సినిమా కోసం తన ప్రాణం పెట్టి నటించాడని అభిమానులు, కామన్ ఆడియన్స్ అంటున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవిని డామినేట్ చేసి మరీ తన యాక్టింగ్, ఎమోషన్స్‌తో అదరగొట్టాడని ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్న సాయి పల్లవిని ఇప్పటివరకు ఏ హీరో కూడా డామినేట్ చేయలేదు. ఈ ఫీట్ సాధించిన ఏకైక హీరోగా చైతూ నిలవడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు