‘మహా సముద్రం’ నుండి అప్ డేట్ వచ్చేసింది !

‘మహా సముద్రం’ నుండి అప్ డేట్ వచ్చేసింది !

Published on Sep 7, 2020 12:11 PM IST

టాలెంటెడ్ డైరెక్టర్ అజ‌య్ భూప‌తి ‘మహా సముద్రం’ అనే సినిమా చేయడానికి ఎప్పటినుండో సన్నాహాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మేకర్స్ ఈ సినిమాకి అధికారిక ప్రకటన విడుదల చేసారు. శర్వానంద్ తన కెరీర్ లో గమ్యం, ప్రస్థానం తరువాత మళ్ళీ అలాంటి బలమైన పాత్రను ఈ సినిమాలోనే చేస్తున్నాడని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఫ్యామిలీ అండ్ యూత్ ఫుల్ హీరో ఇమేజ్ ఉన్న శర్వానంద్ తో పాటు ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మరో హీరో కూడా కనిపించనున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ చిత్రంలో ఇంట్రస్టింగ్ ప్రేమకథ కూడా ఉందట. ఈ సినిమాలో అదితి రావు హైదరి హీరోయిన్ గా నటిస్తోందని రూమర్స్ వినిపిస్తున్నాయి.

కాగా సినిమాలో హీరోయిన్ పాత్ర చనిపోతుందని.. అలాగే స్టోరీ వరల్డ్ కూడా కాస్త కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా పక్కా ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందట. ఇక కరోనా హడావుడి ముగిసాక ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళనున్నారు. ఈ చిత్రం కొరకు పనిచేయనున్న నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మహాసముద్రం చిత్రం తెరకెక్కనుంది. అలాగే ఈ సినిమా తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది.

తాజా వార్తలు