కీర్తి అధ్బుతం అంటున్న రష్మిక

కీర్తి అధ్బుతం అంటున్న రష్మిక

Published on Jun 24, 2020 1:05 PM IST

కీర్తి ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ‘పెంగ్విన్‌’. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ సస్పెన్స్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఈ సినిమా ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా కీర్తి సురేష్ నటన మరియు ఈశ్వర్ కార్తీక్ టేకింగ్ కి మంచి మార్కులు పడ్డాయి. కీర్తి సురేష్ నటనను అనేక మంది చిత్ర ప్రముఖులు పొగిడారు. తాజాగా ‘పెంగ్విన్‌’ మూవీ చూసిన రష్మిక చిత్ర యూనిట్ ని మెచ్చుకుంటూ ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్‌ పెట్టారు. గత రాత్రి ‘పెంగ్విన్‌’ చిత్రాన్ని చూశాను… కీర్తి.. నీ నటన మర్చిపోలేకపోతున్నాను. ఎప్పటిలాగానే ఈ చిత్రంలోనూ నువ్వు చాలా అద్భుతంగా నటించావు. ఆపదల నుంచి కుటుంబాన్ని సైరస్‌ రక్షించడం చాలా బాగుంది. ఈ సినిమా ప్రతి మదర్ కి సంబంధించిందని ఖచ్చితంగా చెప్పగలను. దర్శకుడు ఈశ్వర్‌ కార్తిక్‌, నిర్మాత కార్తిక్‌ సుబ్బరాజుతోపాటు ఇతర చిత్రబృందానికి అభినందనలు’ అని రష్మిక పోస్టు చేశారు.

మహానటి మూవీ తరువాత లేడీ ఓరియెంట్ దర్శకుల బెస్ట్ ఛాయిస్ గా కీర్తి మారిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో మరో రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు ఉన్నాయి. మిస్ ఇండియాతో పాటు మరో చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తుంది. అలాగే మహేష్ తో దర్శకుడు పరుశురాం చేస్తున్న సర్కారు వారి పాట మూవీలో కూడా హీరోయిన్ గా కీర్తి నటించడం విశేషం.

https://www.instagram.com/p/CBvN0fOpgvF/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు