ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతటి తీవ్ర నిరాశలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన లేటెస్ట్ మూవి రాధే శ్యామ్ నుండి ఎటువంటి అప్డేట్స్ రాకపోవడమే దీనికి కారణం. సోషల్ మీడియా వేదికగా ఎంత గోల చేస్తున్నా.. మేకర్స్ లో మాత్రం చలనం లేదు. ఎప్పటికప్పుడు రేపు ఎల్లుండని పొడిగించుకుంటూ వస్తున్నారు.
ఐతే ప్రభాస్ అప్పుడప్పుడు బయటికి వచ్చి ఫ్యాన్స్ కి దర్శనం ఇవ్వడం కొంత ఊరట కలిగించే అంశం. మొన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వలన ప్రభాస్ లేటెస్ట్ లుక్ బయటికి వచ్చింది. అలాగే నిన్న ప్రభాస్ మరో మారు బయట కనిపించి తన మెస్మరైజింగ్ లుక్ లో ఫ్యాన్స్ ని ఫిదా చేశారు. వారు కోరుకుంటన్న అప్డేట్ రాకున్నప్పటికీ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇలా కనిపించడం కొంచం ఉపశమనం కలిగిస్తుంది. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.