ఆ పోస్ట్ చూసి ఫోటోగ్రాఫర్ పై ఫైర్ అయిన దీపిక

ఆ పోస్ట్ చూసి ఫోటోగ్రాఫర్ పై ఫైర్ అయిన దీపిక

Published on Jun 23, 2020 7:50 PM IST

ఓ వీడియో గ్రాఫర్ పెట్టిన పోస్ట్ దీపికా పదుకొనెకు కోపం తెప్పించింది. సదరు వీడియో గ్రాఫర్ పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించింది. మరి అంతగా దీపికాకు కోపం రావడానికి ఆ ఫోటో గ్రాఫర్ చేసిన పనేమిటి అంటే. ఇటీవల ఆత్మ హత్య చేసుకొని మరణించిన సుశాంత్ సింగ్ అంతిమ యాత్రకు సంబంధించిన వీడియోను ఓ ప్రముఖ ఫొటోగ్రాఫర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతే కాకుండా ”నేను తీసిన ఫోటోలు లేదా వీడియోలను నా అనుమతి లేకుండా ఏ ప్లాట్‌ఫామ్‌లోనూ పోస్ట్ చేయరాదు’ అని సదరు వీడియోలో తెలియజేశాడు.

ఈ విషయం దీపికా పదుకొనె కోపానికి కారణం అయ్యింది. ‘అవునా ఐతే ఇలా వీడియో తీయడం సరైన పనేనా? ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు సుశాంత్ కుటుంబ సభ్యుల అనుమతి తీసుకున్నారా? ఒక వ్యక్తి మృతిని కూడా క్యాష్ చేసుకుంటున్నారా?’ అంటూ దీపిక ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఫోటో గ్రాఫర్ సుశాంత్ సింగ్ అంతిమ యాత్రలో తీసిన ఫోటోలకు కాపీ రైట్స్ క్లైమ్ చేస్తున్నట్లుగా వీడియోలో చెప్పడం దీపికాకు కోపానికి కారణం అయ్యింది. ఒకరి చావును కూడా తన స్వార్ధం కోసం వాడుకుంటున్న అతని బుద్ధిని ఆమె ప్రశ్నించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు