ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి చేయబోతున్న ట్రయల్ షూట్ కు వేదిక సిద్ధమైంది. 2 రోజుల పాటు ఈ రోజు మరియు రేపు గండిపేట లేదా హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియమ్ ఫ్యాక్టరీ సమీపంలో నిర్మించిన విలాసవంతమైన సెట్లలో ఈ ట్రయల్ షూట్ జరుగనుంది. అయితే ఈ షూటింగ్ లో తారక్, చరణ్ పాల్గొనడం లేదు. వారికి బదులుగా డ్యూప్లతో షూట్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఈ ట్రయిల్ షూట్ సక్సెస్ అయితే అప్పుడు హీరోలతో షూటింగ్ ను కంటిన్యూ చేయాలనేది జక్కన్న ప్లాన్.
ఈ ట్రయల్ షూట్ కోసం మొత్తం 50 మంది సిబ్బందిని నియమించనున్నారు. ట్రయల్ షూట్ సమయంలో కరోనాకి సంబందించి మరియు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అనుసరిస్తారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుందని అని తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు
డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో అత్యున్నత భారీ అంచనాలు నెలకొన్నాయి.