నేడు సీఎం వై ఎస్ జగ్మోహన్ రెడ్డి తో తెలుగు సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, జెమిని కిరణ్, రాజమౌళి, జీవిత, త్రివిక్రమ్, కొరటాల శివ, సి.కళ్యాణ్, దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్లతో పాటు మొత్తం 25 మంది సభ్యుల బృందం పాల్గొననుంది.
ఈ సందర్భంగా కరోనా లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్లకు అనుమతితో పాటు థియేటర్ల ఓపెన్, తదితర అంశాల గురించి కూడా సీఎం జగన్తో చర్చించే అవకాశం ఉంది.అలాగే వైజాగ్ వేదికగా చిత్ర పరిశ్రమ అభివృద్ధి వంటి విషయాలు, ప్రభుత్వ ప్రోత్సాహం వంటి కీలక విషయాలు చర్చకు రానున్నాయి. ఇక ఈ మీటింగ్ బాలయ్య రాను అని చెప్పిన సంగతి తెలిసిందే.