దర్శకుడు అజయ్ భూపతి ‘మహా సముద్రం’ అనే సినిమా చేయడానికి ఎప్పటినుండో సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే అజయ్ భూపతి సినిమా నుండి మాస్ మహారాజా రవితేజతో పాటు నాగచైతన్య కూడా తప్పుకోవడంతో.. ఫైనల్ గా అజేయ్, హీరో శర్వానంద్ తో ముందుకు వెళ్తున్నాడు. కాగా తాజాగా ఈ సినిమాలో శర్వానంద్ కి జతగా క్రేజీ హీరోయిన్ సాయిపల్లవి నటించబోతుందట. అజయ్ ఇప్పటికే సాయిపల్లవికి కథ కూడా వివరించారట. సాయి పల్లవి కూడా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలోని మరో హీరో పాత్ర కోసం.. అజేయ్ ఫామ్ లో ఉన్న మరో హీరో కోసం ట్రై చేస్తున్నాడు. ఏమైనా “ఆర్ఎక్స్ 100” సినిమాతో సంచలన విజయం సాధించినా.. రెండో సినిమా కోసం మాత్రం అజేయ్ భూపతి బాగా ఎదురుచూడాల్సిన పరిస్థితి. అన్నట్టు ఈ సినిమా ఎకె ఎంటర్ టైన్మెంట్స్ కాంపౌండ్ లోకి వచ్చింది. కరోనా హడావుడి ముగిసాక ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళనున్నారు.
కాగా ఈ సినిమా పక్కా ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందట. సినిమాలో సెకెండ్ హీరో పాత్ర చనిపోతుందని.. అలాగే స్టోరీ వరల్డ్ కూడా కాస్త కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం కొరకు పనిచేయనున్న నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.