సూపర్స్టార్ మహేశ్ బాబు హీరోగా దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్, ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ `సరిలేరు నీకెవ్వరు`. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ప్రొఫెసర్ భారతీగా లేడీ అమితాబ్ విజయశాంతి పవర్ఫుల్ పాత్రలో నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అపూర్వ ఆదరణతో కలెక్షన్ల ప్రభంజనం సృష్లించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్(నాన్ బాహుబలి 2) గా నిలిచింది. ఈ చిత్రం ఫిబ్రవరి 29తో 50రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ పార్క్ హయాత్ హోటల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్యఅథిలుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నిర్మాత అనీల్ సుంకర స్వాగతం పలికారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ అధినేత, చిత్ర సమర్పకులు దిల్రాజు, దర్శకులు అనిల్ రావిపూడి, నిర్మాత, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ శిరీష్, ఫైట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్, శేఖర్ మాస్టర్, ఈ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు పాల్గొన్నారు.
అనంతరం.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ – “ సరిలేరు నీకెవ్వరు` టైటిల్ లోనే అన్నిఉన్నాయి. హీరోగా మహేష్, నిర్మాతలుగా, డిస్ట్రిబ్యూటర్స్ గా అనీల్ సుంకర, దిల్ రాజు సరిలేరు మీకెవ్వరు అని నిరూపించారు. అలాగే ఎవరైనా డిప్రెషన్ లో ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్తే వెంటనే అనిల్ రావిపూడి సినిమా చూడండి అని చెప్తారేమో అంత చక్కగా సినిమాలు తీస్తున్నారు. అనిల్ ప్రతి సినిమాలో ఒక అద్భుతమైన మెస్సేజ్ ఉంటుంది. టీమ్ అందరికీ మళ్ళీ ఇలాంటి సక్సెస్ లు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను” అన్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ – “సినిమా రంగం మీద ఎంతో ప్యాషన్ ఉన్న అనీల్ సుంకర గారు, డిస్ట్రిబ్యూషన్, నిర్మాణ రంగంలో ఎంతో అనుభవం ఉన్న దిల్ రాజు గారు, శిరీష్ గారు వీళ్లందరి సపోర్ట్ తో ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ తీశారు. `సరిలేరు నీకెవ్వరు` అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. ముఖ్యంగా అనిల్ రావిపూడి అంటే అందరికన్నా నాకు ఎక్కువ ఇష్టం. ఆయన ఇలాగే సూపర్ డూపర్ హిట్స్ తీస్తూ అందరిని నవ్విస్తూ ఉండాలనికోరుకుంటున్నాను. నాకు తెలిసిన ఎగ్జిబ్యూటర్స్ ని, డిస్ట్రిబ్యూటర్స్ ని ఇక్కడ చూస్తుంటే నా ఫ్యామిలీ మెంబర్స్ ని కలిసినంత సంతోషంగా ఉంది. మహేష్ లాంటి ఒక సూపర్ స్టార్ తో ఇంత తొందరగా సినిమా పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయడం..అన్ని రికార్డులు బద్దలు కొట్టడం నిజంగా గొప్ప విషయం“ అన్నారు.
చిత్ర నిర్మాత అనీల్ సుంకర మాట్లాడుతూ – “సరిలేరు నీకెవ్వరు` సినిమా ప్రారంభోత్సవం నుండి డిస్ట్రిబ్యూటర్లు , ఎగ్జిబ్యూటర్స్, ఒక పాజిటివ్ ఎనర్జీ తో ఇది తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మారు. అలాగే ఈ సినిమా ప్రతి ఈవెంట్ ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. సినిమా విడుదలైన తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా కలెక్షన్స్ రాబట్టింది. సినిమా విడుదలై యాభై రోజుల తర్వాత కూడా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు నవ్వుతూ ఈ కార్యక్రమం చేసుకోవడం ఒక అద్భుతమైన వరంగా భావిస్తున్నాను. మా దర్శకుడు అనీల్ రావిపూడి గారి కాన్ఫిడెన్స్ కి, ప్యాషన్ కి, అచీవ్ మెంట్ కి, అలాగే మీ ఆత్మీయతకి, అభిమానానికి, ఆదరణకి టేక్ ఏ బౌ“ అన్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ అధినేత, చిత్ర సమర్పకులు దిల్ రాజు మాట్లాడుతూ – “సరిలేరు నీకెవ్వరు విజయవంతంగా యాబై రోజులు పూర్తి చేసుకుంది. అనిల్ రావిపూడి సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసి అనీల్ సుంకర గారికి, నాకు బ్లాక్ బస్టర్ ఇస్తానని ముందే చెప్పాడు. అలానే ఇచ్చాడు. మహేష్ బాబు గారికి కెరీర్ బెస్ట్ ఫిలిం ఇచ్చి ఇండస్ట్రీ లో నెంబర్ వన్ సినిమాగా దీన్ని తీసుకువచ్చినందుకు అనిల్ రావిపూడికి దన్యవాదాలు. ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ కి ప్రత్యేక దన్యవాదాలు” అన్నారు.