కె రాఘవేంద్ర రావు గారి “శిరిడి సాయి” చిత్రం నాగార్జున మీద బాగా ప్రభావం చూపించినట్టు ఉంది. కొద్ది రోజుల క్రితం విలేఖరుల సమావేశంలో ఈ చిత్ర చిత్రీకరణ మొదలు పెట్టుకున్న తరువాత నుండి తన జీవితంలో విచిత్రమయిన సంఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. అంతకముందు జరిగిన పలు ఇంటర్వ్యూలో తనకు దైవ భక్తి తక్కువని తెలిపారు కాని ఈ చిత్ర చిత్రీకరణ మొదలు కాగానే అతని జీవితంలో జరిగిన సంఘటనలు అతన్ని సాయి బాబా మహిమల గురించి నమ్మేలా చేసింది. మాకు అందిన సమాచారం ప్రకారం నాగార్జున జూలై 26న కుటుంబ సభ్యులతో కలిసి శిరిడి వెళ్లనున్నారు. నాగార్జున, నాగ చైతన్య , అఖిల్ మరియు అమల మిగిలిన చిత్ర బృందంతో కలిసి శిరిడి వెళ్లనున్నారు. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం చిత్రం చాలా బాగా వచ్చింది అని అంటున్నారు. ఈ చిత్రం మరొక విజయవంతమయిన చిత్రం కానుంది అని అంటున్నారు. “శ్రీ రామదాసు” మరియు “అన్నమయ్య” లానే ఈ చిత్రం కూడా విజయవంతమయిన చిత్రం కానుందని అంటున్నారు. ఎం ఎం కీరవాణి అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. ఏ మహేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 6న విడుదల కానుంది.
కుటుంబ సమేతంగా శిరిడి వెళ్లనున్న నాగార్జున
కుటుంబ సమేతంగా శిరిడి వెళ్లనున్న నాగార్జున
Published on Jul 16, 2012 11:19 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?