“దమ్ము” ఆడియో హక్కులను దక్కించుకున్న కీరవాణి

“దమ్ము” ఆడియో హక్కులను దక్కించుకున్న కీరవాణి

Published on Feb 23, 2012 12:41 AM IST

జూనియర్ ఎన్ టి ఆర్ నటిస్తున్న చిత్రం “దమ్ము” ఈ చిత్ర ఆడియో హక్కులను వేల్ రికార్డ్స్ సొంతం చేసుకుంది కీరవాణి సొంతమయిన ఈ సంస్థ ఈ చిత్ర హక్కులను మంచి ధరకు కొన్నట్టు సమాచారం ఈ చిత్రానికి సంగీతాన్ని అందించిన కీరవాణి ఈ చిత్ర ఆడియో మీద పూర్తి నమ్మకంతో ఈ హక్కులను కొన్నాడు. రాజమౌళి కూడా ఈ చిత్ర సంగీతం గురించి గతం లో పొగిడారు. ఈ చిత్రం లో ఎన్ టి యార్ మరియు త్రిష ప్రధాన పాత్రలలో నటిస్తుండగా కార్తీక మరొక కథానాయికగా కనిపించబోతుంది.బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అలెగ్జాండర్ వల్లభ నిర్మించారు క్రియేటివ్ కమ్మర్శియల్స్ బ్యానర్ మీద కే.ఎస్.రామ రావు సమర్పిస్తున్నారు.

తాజా వార్తలు