ఏప్రిల్ 10న చాలాకాలంగా అభిమానులు ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల సినిమా మొదలుకానుంది. హారికా & హాసిని బ్యానర్ లపై ఈ సినిమాను రాధాకృష్ణ నిర్మించనున్నారు. వీరు ముగ్గురూ కలిసి గతంలో తేఇస్న జులాయి సినిమా హీరో కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచింది
ఈ సినిమాలో ముగ్గురు నాయికలకు స్థానం వుందని సమాచారం. తారల వివరాలు త్వరలోనే తెలుపుతారు. మే నుండి షూటింగ్ మొదలుకానుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతదర్శకుడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది
ప్రస్తుతం అల్లు అర్జున్ తన బిడ్డతో ఆడుకుంటూ రేస్ గుర్రం విడుదల రోజుకోసం ఎదురుచూస్తున్నాడు. సురేందర్ రెడ్డి తీసిన ఈ సినిమా ఈ నేల ౧౧న మనముందుకు రానుంది