‘శర్వానంద్’ సినిమాలో ఆ హీరోయిన్ ?

Biker
దర్శకుడు శ్రీను వైట్ల – హీరో శర్వానంద్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ఐతే, ఐతే, ఈ సినిమాలో హీరోయిన్‌ గా భాగ్యశ్రీ బోర్సే ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు శర్వానంద్ ఇప్పటికే ఈ సినిమా కోసం తన లుక్ పై కసరత్తులు చేస్తోందని తెలుస్తోంది. కాగా గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడట.

ఈ క్రమంలోనే శర్వాకి కథ చెప్పాడు. కాగా తెలియని వయసులో ఆవేశంలో చేసిన ఓ పని కారణంగా హీరో లైఫ్ లో జరిగే డ్రామా చాలా బాగుంటుందట.
ఆలాగే, హీరో జీవితంలో చోటు చేసుకునే సంఘటనలు కూడా చాలా కామెడీగా సాగుతాయని.. సినిమాలో లవ్ ట్రాక్ కూడా ఫుల్ ఎంటర్ టైన్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో వీరిద్దరి కలయికలో సినిమా మొదలు అవుతుందట. ఈ సినిమాలో మరో సీనియర్ హీరో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.

Exit mobile version