నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది. ఇందులో భాగంగా ప్రసాద్ ల్యాబ్ డబ్బింగ్ స్టూడియోలో ఈ సినిమా డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నట్టు బాలయ్య వచ్చే వారం నుంచి డబ్బింగ్ చెప్పనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో సంయుక్త కథానాయికగా కనిపించనున్నారు.
కాగా మరోవైపు ఈ సినిమా ‘సీజీ మరియు విఎఫ్ ఎక్స్’ వర్క్ కూడా జరుగుతుంది. తమన్ స్వరాలు అందిస్తోన్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు చిత్రబృందం ఇప్పటికే స్పష్టం చేసింది. అన్నట్టు ఇప్పటికే, విడుదలైన ఈ సినిమా టీజర్ ట్రెండ్ సృష్టించిన విషయం తెలిసిందే. అఖండ 2 – తాండవం’ పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు.