విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. మరికొద్ది గంటల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేయగా భారీ క్యాస్టింగ్ నటిస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.
ఈ సినిమాతో ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని.. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన చిత్రమని మంచు విష్ణు అన్నారు. అయితే, ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై కూడా విష్ణు తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇలాంటి చిత్రాన్ని ప్రేక్షకులు థియేటర్లలో చూడాలని తాము కోరుతున్నామని.. అందుకే ఈ సినిమాను వీలైనంత మంది చూసే విధంగా ఈ చిత్ర రిలీజ్ అయిన 10 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నామని విష్ణు అన్నారు.
దీంతో ఈ చిత్రం పది వారాల తర్వాతే ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఇక ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.