మూడో షెడ్యూల్ మొదలుపెట్టిన మెగాస్టార్ !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతుంది. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోంది. కాగా ఇటీవలే ముస్సోరీలో రెండవ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఈరోజు, మూడవ షెడ్యూల్ ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ షెడ్యూల్ లో చిరు – నయనతార ల పై కీలక సన్నివేశాలను ఘాట్ చేస్తారట. ఈ చిత్రంలో కేథరీన్ థెరీసా, మాస్టర్ రేవంత్, ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2026 సంక్రాంతి సందర్భంగా పండుగ సందర్భంగా విడుదల కానుంది.

కాగా ఈ సినిమా గురించి మెగాస్టార్ ఆ మధ్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని.. ఈ మూవీ కథ తనకు నచ్చిందని చిరు ఆల్ రెడీ చెప్పారు. అన్నట్టు, అనిల్ రావిపూడి చెప్పే సీన్స్ గురించి కూడా మెగాస్టార్ చెబుతూ.. ‘సినిమాలో ఆయా సన్నివేశాల గురించి అనిల్‌ రావిపూడి నాకు చెబుతుంటే కడుపుబ్బా నవ్వుతున్నాను. ఈ సినిమా కచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది’ అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తారని చిరు తెలిపారు.

Exit mobile version