మొదలైన మంచు వారి మల్టీ స్టారర్ సినిమా

First Posted at 14:58 on Apr 21st

Mohan-Babu-New-Film

లక్ష్మి ప్రసన్న ఫిల్మ్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న మంచువారి మల్టీ స్టారర్ సినిమా నేడు ఫిలింనగర్ లో లాంచనంగా ప్రారంభమయ్యింది. ఈ సినిమాకి శ్రీవాస్ దర్శకుడు. ఈ చిత్రంలో కలక్షన్ కింగ్ మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, బాలీవుడ్ నటి రవీనా టాండన్, హన్సిక, ప్రణీత నటిస్తున్నారు. విష్ణు, మనోజ్ ఈ సినిమాకు నిర్మాతలు. కోన వెంకట్, గోపి మోహన్, బి.వి.ఎస్ రవి కధను అందించారు.

మొదటి సన్నివేశానికి దర్శకరత్న దాసరి నారాయణ రావుగారు క్లాప్ నివ్వగా, కే రాఘవేంద్ర రావు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ “ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయడం ఆనందంగావుంది. మంచి రైటర్స్, హీరోలు, టెక్నీషియన్స్ దొరికారు. పకడ్బంది స్క్రిప్ట్ తో కడుపుబ్బ నవ్వించే కామెడితో సినిమా ఉంటుంది. ఇంకా ఇద్దరు హీరోయిన్స్ ని ఖరారు చెయ్యవలసివుందని”అన్నారు.

Exit mobile version