జమ్మూకశ్మీర్లోని హంద్వారాలో ముష్కరులు జరిపిన ఎన్కౌంటర్లో భారత సైన్యం అయిదుగురు సైనికులను కోల్పోయిన దురదృష్ట సంఘటన తెలిసిందే. కాగా హంద్వారా దాడిని సూపర్ స్టార్ మహేష్ బాబు ఖండించారు. మరణించిన ఐదుగురు సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నట్టు మహేష్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
ఈ సందర్భంగా మహేష్ పోస్ట్ చేస్తూ.. ‘హంద్వారా దాడి’ మన దేశానికి చీకటి సమయం. మన సైనికుల ధైర్యం మరియు మన దేశాన్ని పరిరక్షించాలనే వారి గొప్ప సంకల్పం అసమానమైనవి. మన కోసం విధి నిర్వహణలో మరణించిన మన సైనికులను గౌరవించటానికి వారికి ఘనమైన నివాళులర్పించటానికీ నేను మౌనంగా లేచి నిలబడతాను. ప్రియమైన వారందరికీ హృదయపూర్వక సంతాపం. ఈ కష్ట సమయంలో వారి కుటుంబాలకు ప్రేమ మరియు శక్తిని ఇవ్వాలని కోరుకుందాం. జై హింద్’ అని మహేష్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
ఇక మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో సైనికుడిగా నటించి మెప్పించిన సాంగతి తెలిసిందే.