ప్రభుత్వ పోరాటానికి సుకుమార్ సహకారం

కోవిడ్ 19 వ్యాప్తి నివారణకు రెండు తెలుగు రాష్ట్రాలు సమగ్రంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ పోరాటం కోసం భారీ మొత్తంలో నిధులను ఖర్చు చేస్తున్నాయి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు. వీరికి సహకారంగా సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే పవన్, రామ్ చరణ్, ప్రభాస్, నితిన్, వినాయక్, మహేష్ బాబు, ఎన్టీఆర్, కొరటాల శివ లాంటి చాలామంది దన సహాయం చేయగా తాజాగా వారి జాబితాలో డైరెక్టర్ సుకుమార్ కూడా చేరారు.

ఆయన తన వంతుగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 లక్షలు డొనేట్ చేశారు. ఇప్పటికే ఇండస్ట్రీ నుండి పెద్ద ఎత్తున విరాళాలు అందగా ఇంకా విరాళాలు అందుతున్నాయి. సినీ ప్రముఖులు ఇలా సహకారం అందించడం పట్ల ఇరు రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలు విశేషంగా కొనియాడుతున్నారు. తమ అభిమాన తారలను ఫాలో అవుతూ సామాన్యులు సైతం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం డొనేషన్స్ ఇస్తున్నారు.

Exit mobile version