ఆస్కార్ రేస్ లో బర్ఫీ


రన్బీర్ కపూర్, ప్రియాంక చోప్రా మరియు ఇలియానా ప్రధాన పాత్రలలో వచ్చిన చిత్రం “బర్ఫీ” వచ్చే ఏడాది ఆస్కార్ కి భారతదేశం నుండి పంపుతున్న చిత్రం అయ్యింది. ఇక్కడ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జ్యూరి చైర్ పర్సన్ అయిన మంజు బోరా మాట్లాడుతూ “దాదాపుగా 20 వివిధ భాషల చిత్రాలు చూడగా “బర్ఫీ” చిత్రాన్ని ఆస్కార్స్ కి ఎంపిక చెయ్యడం జరిగింది ఈ చిత్రంలో భారతీయ సంప్రదాయాన్ని బాగా చూపించడమే కాకుండా చిత్రంలో మంచి హృద్యమయిన కథ ఉంది” అని అన్నారు. ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రన్బీర్ కపూర్ మూగ మరియు బధిరుడి పాత్రలో కనిపించారు. ప్రియాంక చోప్రా మానసిక వికలంగురాలి పాత్రలో కనిపించింది. ఇలియానా బెంగాలి అమ్మాయి పాత్రలో కనిపించింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబట్టుతుంది. రొన్ని స్క్రువాలా మరియు సిద్దార్థ్ రాయ్ కపూర్ ఈ చిత్రాన్ని యుటివి మోషన్ బ్యానర్ మీద నిర్మించారు, ఇలియానా ఈ చిత్రంతో బాలివుడ్ లో అడుగుపెట్టింది చూస్తుంటే ఆమె బాలివుడ్ భవిష్యత్తు చాలా బాగుండేలా అనిపిస్తుంది.

Exit mobile version