మరో వారం రోజులలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగ రానుంది. మే 20న ఎన్టీఆర్ జన్మదినం కావడంతో వారు భారీ ఏర్పాట్లతో సిద్ధం అయ్యారు. గత ఏడాది ఎన్టీఆర్ తన పుట్టిన రోజు వేడుకలను తిరస్కరించడం జరిగింది. తన తండ్రి గారైన హరికృష్ణ అకాల మరణం నుండి తేరుకోని ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. దీనితో ఈ ఏడాదైనా ఘనంగా నిర్వహించాలని ఫ్యాన్స్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఐతే ఈ సారి ఫ్యాన్స్ ఉత్సహానికి కరోనా లాక్ డౌన్ దెబ్బేసేలా ఉంది. ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుండగా, అది 18వరకు అమలులో ఉంటుంది. దీన్ని పొడిగించే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇక తెలంగాణా రాష్ట్రంలో కెసిఆర్ 29వరకు లాక్ డౌన్ పొడిగించడం జరిగింది. అలాగే తెలుగు రాష్ట్రాలలో కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదు. దీనితో ఎన్టీఆర్ తన పుట్టిన రోజు వేడుకల నిర్వహణను తిరస్కరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఐతే రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ నుండి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో రానుండడంతో దానితో సరిపెట్టుకొనే పరిస్థితి ఏర్పడవచ్చు.