క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఐపీఎల్ టోర్నమెంట్ 2025 ఫైనల్ మ్యాచ్ నేడు జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్లో RCB, PBKS జట్లు పోటీ పడుతుండటంతో ఏ జట్టు ఈ సీజన్ కప్ గెలుస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ ఫైనల్ మ్యాచ్లో సినీ ప్రేమికులకు కూడా ఓ సర్ప్రైజ్ రానుంది.
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్లో సినీ ప్రేమికులకు ‘వార్-2’ మూవీ నుంచి ఓ ప్రోమో సర్ప్రైజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రోమోతో ‘వార్-2’ ప్రమోషన్స్ షురూ చేయనున్నారు మేకర్స్. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ నటిస్తుండగా దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్కు రెడీ చేస్తున్నారు.