తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కూలీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పక్కా మాస్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే రజినీ తన నెక్స్ట్ చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నాడు.
దర్శకుడు నెల్సన్ దిలీప్ డైరెక్ట్ చేసిన ‘జైలర్’తో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు తలైవా. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ను తెరకెక్కి్స్తున్నారు. అయితే, ఈ సినిమాలో బాలీవుడ్ భామ విద్యా బాలన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. జైలర్ చిత్రంలో రజినీ భార్యగా రమ్యకృష్ణ నటించింది. మరి ఇప్పుడు విద్యా బాలన్ ఈ సీక్వెల్ మూవీలో ఎలాంటి పాత్రలో నటిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
ఇక ఈ సినిమాలో శివ రాజ్కుమార్, జాకీ ష్రాఫ్, మోహన్ లాల్లతో పాటు తెలుగు హీరో బాలకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నారట. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.