విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్గా నిలిచింది. పూర్తి కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాతో వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది.
అయితే, వీరి కాంబినేషన్లో మరో మూవీ రానుందా అంటే.. అవుననే చెప్పాలి. తాజాగా జరిగిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ విక్టరీ వేడుక కార్యక్రమంలో వెంకటేష్ ఈ మేరకు కామెంట్ చేశారు. ‘2027 సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం’ అంటూ వెంకటేష్ కామెంట్ చేశారు. దీంతో మరోసారి ఈ కాంబినేషన్లో మూవీ రానుందనేది కన్ఫర్మ్ అయ్యింది.
ఇక అనిల్ రావిపూడి తన నెక్స్ట్ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో చేయనుండగా, సమ్మర్లో ఈ మూవీ పట్టాలెక్కనుంది. 2026 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి వెంకీ-అనిల్ కాంబోలో రాబోయే నెక్స్ట్ మూవీ ఎలాంటి కథతో రానుందో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.