తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వీర ధీర శూర పార్ట్-2’ భారీ అంచనాల మధ్య ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు ఎస్.యు.అరుణ్ కుమార్ పూర్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాడు. అయితే, ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మిక్సిడ్ రెస్పాన్స్ దక్కింది.
ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 5 భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ దక్కుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
ఈ సినిమాలో విక్రమ్ సరసన దుషార విజయన్ హీరోయిన్గా నటించింది. ఎస్.జె.సూర్య, సూరజ్, పృథ్వీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.